Home » Old City
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
గోమతి ఎలక్ట్రానిక్స్లో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఓ యువతిని ఫేక్ బాబా మోసగించాడు ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో జరిగింది. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పాతబస్తీ పోలీసులు వెల్లడించారు.
పాతబస్తీ మెట్రో కారిడార్ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు పాతబస్తీలో మెట్రో పిల్లర్ల పనులకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది.
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి. పురాతన కట్టడాలు ఎక్కడున్నా వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. దీనిని అక్షరాలా అమలు చేశారు హైదరాబాద్ సీపీ.. సీవీ ఆనంద్.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
ఓల్డ్ సిటీలో యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై స్థానికులు తిరగబడ్డారు. మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్లో ఉండటంతో తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు.