Home » Odisha
ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.
యోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిరం నిర్మించిన అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. ఫైజాబాద్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన లల్లు సింగ్ ఓడిపోయారు. దాంతో బీజేపీ శ్రేణులు, నేతుల షాక్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో బీజేపీ స్టాండ్ అయోధ్య నుంచి ఒడిశాకు మళ్లిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్ పట్నాయక్కు ప్రజలు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఒడిశాలో నాలుగు దశలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది.
సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ విడుదలైనట్లు.. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ క్రమంలో మరికాసేపట్లో పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈసారి ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎన్డీయే, ఇండియా కూటమి ఎత్తులు పైఎత్తులతో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పావులు కదిపాయి. ఎట్టకేలకు రేపు ఏడో దశ పోలింగ్తో లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు తెరపడనుంది.