Home » Nitish Kumar
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన 75 ఏళ్ల నితీష్ కుమార్ మరోసారి అధికారాన్ని ఆశిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామిగా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్ర ప్రజలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు. గృహ వినియోగదారులందరికి ప్రతినెల 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Free Electricity: ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్న్యూస్ చెప్పారు. ఆగస్టు నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇక, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు.
2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.
వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి, పలు పెట్రోల్ పంప్లు ఉన్నాయి.
సీతమ్మ వారి జన్మస్థలమైన పునౌరా థామ్ సీతామఢి సర్వోతోముఖాభివృద్ధికి రూ.882.87 కోట్లతో సమగ్ర ప్లాన్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
బిహార్లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతున్నట్టు శనివారం ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ ప్రకటించారు.
బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసింది. సామాజిక భద్రతా పెన్షన్ స్కీం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడు ప్రతి నెలా రూ. 400కు బదులుగా రూ. 1100 పెన్షన్ లభిస్తుందని సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు.