Home » Nitish Kumar
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హస్తినలో చర్చలు ఊపందుకోనున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు ఇద్దరూ విస్తారా విమానంలో ఢిల్లీకి బయలుదేరడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్(Nitish Kumar) బుధవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 40 సీట్లలో 12 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకున్న జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నోరుజారారు.
ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారంనాడు పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సరిగ్గే ఇలాగే తడబడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్లోని పూర్నియా లోక్సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు నితీశ్కు అంత దుస్థితి ఏమొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.