Home » New Delhi
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
పార్టీ విప్లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యమునా నది బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతానికి 207 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి మూసేశారు. నిత్యం రద్దీగా ఉండే 'మంజూ కా తిలా' మార్కెట్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా మూగవోయింది.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో నక్సల్స్తో పోరాడిన సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, డీఆర్జీ, కోబ్రా జవాన్లను వారి కుటుంబ సభ్యులతో సహా కలుసుకుని సన్మానించడం జరిగిందని అమిత్షా తెలిపారు.
2024 డిసెంబర్ 31 లోపు వివిధ కారణాలతో భారత్కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ శరణార్ధుల వద్ద పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకున్నా భారత్లో ఉండేదుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుండి ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'నెక్స్ట్-జెన్' జీఎస్టీ సంస్కరణలు..
గత జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇండియా ఎవరినీ శత్రువుగా భావించదని, ఇదే సమయంలో ప్రజల ప్రయోజనాలకు భంగం కలగనీయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.