Home » New Delhi
సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. ఇందుకోసం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు.
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.
ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు ఢిల్లీ హైకోర్టు మూడు రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది.
దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2027 సంవత్సరానికి వార్షిక పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ, సీడీఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి పరీక్షల షెడ్యూల్ను ఇందులో పొందుపరిచారు.
జేఎన్యూ మాజీ విద్యార్థి నేత, 2020 ఢిల్లీ అల్లర్లతో ముడిపడిన కుట్ర కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం-2026లో పాల్గొంటారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వస్తు సేవల పన్ను లావాదేవీలలో జరిగిన భారీ మోసాలకు సంబంధించి పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.100 కోట్ల మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక వివాహిత ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.