Home » Nepal
ఢిల్లీ(Delhi)ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్లో 5.6 తీవ్రతతో ఇవాళ భూకంపం(Earthquake) వచ్చింది. ఆ తరువాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - ఎన్ సీఆర్లో ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
నేపాల్ను 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని ఆదివారంనాడు నేపాల్కు పంపింది.
నేపాల్లో అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ భూకంపంలో మృతుల సంఖ్య 100 దాటింది. ఇప్పటివరకు 128 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు.
పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కోసం నేపాల్ అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్లో నేపాల్ తలపడనుంది. పొట్టి ప్రపంచకప్కు అర్హత సాధించడం నేపాల్కు ఇది రెండో సారి.
నేపాల్(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది.
ఏషియన్ గేమ్స్లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ప్రపంచ రికార్డులు బదలయ్యాయి. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నేపాల్ బ్యాటర్లు కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టారు.
పాకిస్థాన్పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
సూపర్-4లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అటు టీమిండియా, ఇటు నేపాల్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సులభమైన మూడు క్యాచ్లను మన ఆటగాళ్లు నేలపాలు చేశారు.
ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ నజరానా ప్రకటించింది.