Home » National
వినియోగదారుల సౌలభ్యం కోసం మరో కొత్త యాప్ను తీసుకొచ్చింది ఉడాయ్. దీని ద్వారా ఆధార్ను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన వివరాలను మాత్రమే షేర్ చేస్కునే వెసులుబాటు ఉంటుంది.
దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణలో తీగ లాగగా సంబంధమున్న వ్యక్తుల డొంక కదులుతోంది.
ఇటీవల 150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతరం గేయాన్ని ఇకపై విధిగా ప్రతి స్కూల్లో పాడాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే దేశం పట్ల భక్తి, గౌరవం పెంపొందుతాయని యోగి సర్కార్ తెలిపింది.
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా తల్హేరి గ్రామానికి చెందిన యద్వీందర్ అనే రైతు పుట్టగొడుగుల సాగుతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఆయన ఎనిమిదో తరగతి వరకే చదివి.. ఆర్థిక ఇబ్బందులతో బడి మానేశాడు. స్థానికంగా ఏ పనిలేక పోవడంతో ఆయన కుటుంబంలో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కష్టాల కడలిని ఈది.. అతిమంగా విజయం సాధించారు.
ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ ను (Baal Aadhaar Card) కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్తో లింక్ చేయాల్సిఉంటుంది.
బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బైక్పై యువతిని ఎక్కించుకుని వెళ్తున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో యువతి కాళ్లను తాకుతున్నాడు. తొలుత అన్నా.. ఇలా ప్రవర్తించవద్దని యువతి పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా అతడు వినకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
నక్సల్స్పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్థులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యంఇస్తూ....
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసుపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.