Home » Nara Bhuvaneswari
నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా సమాజ హితం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను నారా భువనేశ్వరి లండన్లో ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
లండన్లోని వెస్ట్మినిస్టర్ హాల్లో 2025 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న నారా దేవాన్ష్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు దేశ విదేశాల్లోని తెలుగువారు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.
దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘తలసేమియా రన్’కు లాన్సమ్ ఎన్పాయింట్ డెవలపర్స్ ఎల్ఎల్పీ గ్రూపు చైర్మన్ కూనపురెడ్డి ఉమేశ్ రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ చెక్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అందజేశారు
తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్ను ఓపెన్ చేశారు.