Home » Nara Bhuvaneswari
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఓ జాబ్మేళా కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత కష్టాన్ని నమ్ముకుని, స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు..
ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవలకు మారు పేరు. ఈ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు..
నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం ప్రజలతో కలిసి అత్యంత సాదాసీదాగా గడిపారు..
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025'ను సౌత్జోన్ ప్రదానం చేసింది.
విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.