Home » Nara Bhuvaneswari
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో జరగనుంది. కుప్పం నియోజకవర్గం.. గుడిపల్లి మండలం అత్తి నాతం గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియడంతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయారు.
వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది.
Andhrapradesh: హిందూపురం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్తో మనస్థాపం చెందిన చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం హిందూపురం టౌన్ చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు.
Andhrapradesh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కదిరి, ఎర్రదొడ్డి, హరీష్ రెసిడెన్షియల్ విద్యార్థులతో భువనేశ్వరి మాటమంతి నిర్వహించారు.
నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.