Share News

Nara Bhuvaneswari: 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:00 PM

నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో జరగనుంది. కుప్పం నియోజకవర్గం.. గుడిపల్లి మండలం అత్తి నాతం గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

Nara Bhuvaneswari: 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి

చిత్తూరు: నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) నిజం గెలవాలి (Nijam Gelavali) కార్యక్రమం ప్రస్తుతం కుప్పం (Kuppam) నియోజకవర్గంలో జరగనుంది. కుప్పం నియోజకవర్గం.. గుడిపల్లి మండలం అత్తి నాతం గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.

ఆమెకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులి వర్తి నాని (Pulivarthi Nani) పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించునున్నారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం అందించనున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వరి 3 అన్నా క్యాంటీన్ల (Anna Canteens)ను సైతం ప్రారంభించనున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:00 PM