Home » Mudragada Padmanabham
Pawan Kalyan: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు.
నేడు ముద్రగడ ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. వైసీపీలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి, మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఆహ్వానించనున్నారు. పార్టీ మాటగా రాజ్యసభ ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయంచాలని వైసీపీ ఆలోచిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై వ్యక్తిగతంగా మాట్లాడతామని జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు(Govinda Rao) హెచ్చరించారు.
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలో గుబులు ప్రారంభమైంది. అక్కడ అభ్యర్ధిని మళ్లీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి జగన్ బదిలీ చేశారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని.. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు.
కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) లాంటి నిజాయితీగల వారు జనసేనలోకి వస్తే మరింత బలం చేకూరుతుందని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ( Bolishetti Srinivas ) తెలిపారు.
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో టీడీపీ, జనసేన నేతల వరుస భేటీలపై ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో గిరిబాబు మాట్లాడుతూ.. ముద్రగడ... టీడీపీ, జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాపు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాపు లీడర్లను కలిసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. ప్రస్తుతం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరే ఎక్కడ చూసినా వినిపిస్తోంది.
కాపులకు ఏకైక నాయకుడిగా ఉండాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తాపత్రయ పడుతున్నారని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య (Hariramajogaiah) విమర్శించారు.
ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా హీటెక్కాయి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు, కౌంటర్లతో మార్మోగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) , జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) పేర్లే వినిపిస్తున్నాయి..