Home » MLC Elections
మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొనసాగనుంది.
కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్ విధాన పరిషత్ ఎన్నికలకు తమ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు ప్రకటించింది.యూపీలోని 13 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 5వ తేదీతో ముగియనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్ నగర్లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు కూడా కోడ్ వర్తించనుంది.
బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.
MLC Kodandaram: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే, వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా.. గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జనవరి 17: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఫైనల్ చేసింది. వీరిద్దరు పేర్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఖరారు, ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్లో ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనున్నది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది.
గ్రేటర్లో బలంగా ఉన్నామనుకుంటోన్న బీఆర్ఎస్(BRS) పరిస్థితి రోజురోజుకూ మారుతోంది. పలు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు,
మల్కాజిగిరి నియోజకవర్గం(Malkajigiri Constituency)లో మహిళా ఓటర్లే కీలకం. అభ్యర్థి గెలుపులో వీరి పాత్రే ఎక్కువ.