Home » MLA
రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్ కల్యాణ్ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలానగర్ మండల కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వరద జలాలతో నింపి కరువు సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆఫ్లైన్ బెట్టింగ్ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిందని తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి వరద నీటి సమస్యను పరిశీలించారు.
ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్ హాల్ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు.
పేద ప్రజలపై అధికంగా ఆస్తిపన్నులు వేసి ఆర్ధిక భారం మోపొద్దని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నర్సింహ, మల్లారెడ్డిలను ఆయన మంగళవారం కలిశారు.
రాష్ట్రంలో ప్రజారోగ్యా నికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఇంటరాగేషన్ నుంచి తప్పించుకునే సమయంలో జిబాన్ సహా తన మొబైల్ను మురుగు కాలువలోకి విసిరేయడంతో దానిని ఈడీ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి తాజాగా ఈడీ రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది.