Home » Medical News
ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్థు నేతృత్వంలోని అధికారులు బుధవారం సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి మౌలిక వసతుల పర్యవేక్షణ, సకాలంలో పనుల పురోగతిని వేగవంతం చేయడానికి సమన్వయ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 202 ప్రభుత్వ ఆస్పత్రులకు దశలవారీగా బ్రాండింగ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలిదశలో 84 ఆస్పత్రులను ఎంపిక చేశారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్బీ నగర్, సనత్నగర్, అల్వాల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి.
నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝులిపించింది.
మెదడులో ఏర్పడే క్యాన్సర్ కణితులకు శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేసే గామా నైప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి గామా నైఫ్ సెంటర్ను గురువారం కిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో పాటు వివిధ అంశాలపై వారంలో వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఈమెయిల్స్ పంపింది.
హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎ్సఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్ టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్పమెంట్ మెంబర్, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ తెలిపారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
నిత్యం వినియోగించే 300 రకాల బ్రాండెడ్ ఔషధాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలకు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5 రకాల ఔషదాల్లో ...