Home » Manmohan Singh
పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు, పని చేస్తున్న వారు టిక్కెట్లు దక్కించుకుని విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు.
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు.
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 90 ఏళ్ల మన్మోహన్ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఆరోగ్యం సరిగా లేని మాజీ ప్రధానిని అర్ధరాత్రి వరకూ పార్లమెంటులో వీల్చైర్పై కూర్చోబెట్టడం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
మణిపూర్లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు బ్రిటన్లో జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని (Lifetime Achievement Honour) ప్రకటించడం జరిగింది.