• Home » Mancherial

Mancherial

జిల్లా కేంద్రంలో పెరుగుతున్న  అసాంఘిక చర్యలు

జిల్లా కేంద్రంలో పెరుగుతున్న అసాంఘిక చర్యలు

వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదును చూసి, గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు, ఎవరిపైన దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.

అవకతవకలు లేకుండా సర్వే చేపట్టాలి

అవకతవకలు లేకుండా సర్వే చేపట్టాలి

అవక తవకలు, పొరపాట్లు లేకుండా రైతు భరోసా, రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపిక జాబితాను తయారు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సి పాలిటీలోని 5వ వార్డు, మండలంలోని ఎల్లారం, గుల్లకోట గ్రామంలో సర్వే ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీ లించి మాట్లాడారు.

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేశారని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాల యం నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందించారు.

జోరుగా కోడి పందేలు...

జోరుగా కోడి పందేలు...

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల పట్టణం గోదావరి రోడ్డులో చేపట్టిన మహా ప్రస్తాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించిన అనంతరం మంచిర్యాల మార్కెట్‌ ఏరియాలో పర్యటించారు. మార్కెట్‌ ఏరియాలో రోడ్డు విస్తరణ పనులు మంద కొడిగా సాగుతున్నాయని, అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు మోహనాచారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల వినూత్న నిరసన

సమస్యలు పరిష్కరించాలని సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మి కులు ఆకులు తింటూ నిరసన తెలిపారు. సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, రంజిత్‌ కుమార్‌లు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, వేతనాల చెల్లింపుల విష యంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి

క్వారీ తవ్వకాల్లో నిబంధనలు గాలికి

కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు.

శాలివాహన భూములను అమ్మవద్దు

శాలివాహన భూములను అమ్మవద్దు

పాత మంచిర్యాలలో శాలివాహన పవర్‌ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి