• Home » Mancherial

Mancherial

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు.. తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి... సింగరేణి... వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే కల్పవల్లి. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది... సోమవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను జరుపుకునేందుకు కార్మికలోకం సిద్ధమైంది...

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు పేర్కొ న్నారు. ఆదివారం ఇందా రం, ఎల్కంటి, గంగిపెల్లి, జైపూర్‌ గ్రామాల్లో ఇంది రమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.

కార్పొరేషన్‌ దిశగా అడుగులు

కార్పొరేషన్‌ దిశగా అడుగులు

మంచిర్యాల మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కానుంది. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంచిర్యాలను మున్సిపల్‌ కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేతతో కలిసి పరిశీలించారు.

చేతివృత్తులతో యువతకు ఉపాధి

చేతివృత్తులతో యువతకు ఉపాధి

చేతి వృత్తులతో యువతకు ఉపాధి లభిస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ చేతివృత్తుల డైరెక్టర్‌ దివ్యారావు అన్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణను పొందుతున్న మహిళలకు నస్పూర్‌ కాలనీలోని సేవా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

కామన్‌ మెనూపై   స్పష్టత ఏదీ...?

కామన్‌ మెనూపై స్పష్టత ఏదీ...?

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచిన ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కామన్‌ మెనూ ఎంత ఇవ్వాలనే అంశాన్ని విస్మరించింది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, చికెన్‌, మాంసానికి అనుగుణంగా 40 శాతం మెస్‌ చార్జీలను, 200 శాతం వరకు కాస్మొటిక్‌ చార్జీలను పెంచడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు.

కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంల నిరసన

కలెక్టరేట్‌ ఎదుట రెండో ఏఎన్‌ఎంల నిరసన

కొన్నేళ్ళుగా పని చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టాలన్నా విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్‌ఎంలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

హడలెత్తిస్తున్న బెబ్బులి

హడలెత్తిస్తున్న బెబ్బులి

మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బెబ్బులి హడలెత్తిస్తోంది. పాత మంచిర్యాల అటవీ సెక్షన్‌ పరిధిలోని పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్‌లోని అడవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు, పశువుల కాపర్లు, అడవిలోకి వెళ్లవద్దని, ఎలాంటి విద్యుత్‌ వైర్లు అమర్చకూడదని సూచించారు.

అమృత్‌ 2.0 పథకంతో మున్సిపాలిటీల అభివృద్ధి

అమృత్‌ 2.0 పథకంతో మున్సిపాలిటీల అభివృద్ధి

అమృత్‌ 2.0 పథకంతో జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌కు చేపట్టిన ఏరియల్‌ సర్వేను జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. మంచిర్యాల మున్సిపాలిటీ ప్రాంతంలో నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధికి డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేపట్టినట్లు చెప్పారు.

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ అధికారికి అందజేశారు. యూనియన్‌ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, జిల్లా కార్యదర్శి రఫీయాలు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి