Home » Mancherial district
దేవాపూర్ ఓరియంట్ సిమెం ట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈశ్వర మ్మ ఎన్నికల ప్రక్రియపై వివరాలను వెల్లడించారు.
బెల్లంపల్లి నియో జకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాము మం జూరు చేసిన నిధులతో పనులు చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు.
కమ్యూనిస్టులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్ను శ్రీరాంపూర్లోని పార్టీ కార్యాల యంలో విడుదల చేశారు.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో హరీష్రాజ్ అన్నారు. శుక్రవారం సామాజిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను పరిశీ లించారు.
వ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదును చూసి, గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు, ఎవరిపైన దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.
అవక తవకలు, పొరపాట్లు లేకుండా రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక జాబితాను తయారు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సి పాలిటీలోని 5వ వార్డు, మండలంలోని ఎల్లారం, గుల్లకోట గ్రామంలో సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తోందన్నారు.
ఆదివాసీ గిరిజనులు మూఢ నమ్మకాలను విడనాడాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం దేవాపూర్ పంచాయతీ పెద్దాపూర్కొలాంగూడలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తు తం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అయినప్పటికీ కొందరు ఆదివాసీ గిరిజనులు నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వర్ అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీ లించి మాట్లాడారు.
పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాల యం నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పందేలు ఆడుతూ ఆదివారం పలువురు పందెం రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. కోడి పందేల బెట్టింగులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.