Home » Mallikarjun Kharge
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చలు జరిపారు
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం దుమారం రేగింది. డిప్యూటీ చైర్మన్ను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాత్రమే చేశానని వివరణ ఇచ్చిన ఖర్గే.. డిప్యూటీ చైర్మన్కు క్షమాపణ చెప్పారు.
రాజ్యసభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే జోక్యం చేసుకుంటూ, తాను ఉదయం మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు.
డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాకుండా ఎవరూ ఆపలేరంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీరప్ప మొయిలీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఖర్గేను డీకే కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగుచేయలేరా..? దేశవ్యాప్తంగా ఆ పార్టీకి భవిష్యత్తు లేదా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి. గ్రాండ్ ఏఐ పార్టీలో మార్పులు తీసుకు రాలేరా..? ఆ పార్టీ ఓడిపోతే ఎవరూ బాధ్యత తీసుకోరా..? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జీరో స్కోర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, అమెరికా డాలర్తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా సహనం కోల్పోయారు.
నరేంద్ర మోదీ గత పదేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజానీకం నుంచి రూ.54.18 లక్షల కోట్లు ఆదాయం పన్ను రూపంలో వసూలు చేసిందని, ఇప్పుడు రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ప్రకటించి ఏడాదికి రూ.80,000 ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెబుతున్నారని ఖర్గే అన్నారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.