Home » Madhya Pradesh
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎట్టకేలకు బుధవారం రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో లోడ్ చేసి భోపాల్కు 250 కిమీ దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించారు.
cheetah: నేషనల్ పార్క్ నుంచి వాయు అనే చిరుత తప్పించుకొంది. దీంతో మధ్యప్రదేశ్లోని షియోర్పూర్ నగర ప్రజలు హడలిపోతున్నారు. నగరంలో అర్థరాత్రి చిరుత సంచారాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది.
కెన్-బెత్వా రీవర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి ``పుష్ప 2`` సినిమా చూసేందుకు ఆదివారం నాడు ఇందర్గంజ్ ప్రాంతంలోని కైలాష్ టాకీస్కు వెళ్లాడు. ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్ కొన్నాడు. అయితే ఆ స్నాక్స్ బిల్లు విషయంలో షబ్బీర్కు, క్యాంటిన్ ఓనర్ రాజుకు మధ్య వాగ్వాదం మొదలైంది.
పులి కంట పడిన జంతువైనా, మనిషి అయినా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారిగా దాని కంటపడగానే వెతికి వెతికి మరీ వేటాడుతుంది. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు పులి నోటిదాకా వెళ్లి అదృష్టవశాత్తు తప్పించుకుంటుంటాయి. అలాగే మనుషులు కూడా పులులు కళ్లగప్పి ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి ..
తల్లి కళ్లల్లో ఆనందం కోసం నకిలీ పోలీసు అవతారం ఎత్తిన ఓ యువతిపై తాజాగా కేసు నమోదైంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
గ్వాలియర్లోని హజీరా జాతీ లైన్ ప్రాంతానికి చెందిన భవిష్య(14) అనే బాలుడు స్థానిక బీటీఐ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం పాఠశాల అనంతరం తన స్నేహితుడిని ఇంటి వద్ద దింపేందుకు భవిష్య నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి సైకిల్పై ఏఆర్పీ కాలనీకి బయలుదేరారు.
‘నాకు ఉద్యోగం వచ్చే వరకు నీవు కూడా జాబ్ చేయడానికి వీల్లేదు. చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసెయ్’ అంటూ భార్యపై ఒత్తిడి తెచ్చిన భర్తపై మధ్యప్రదేశ్ హైకోర్టు కఠినంగా వ్యవహరించింది.
వితంతువైన కోడలికి ఆమె మామ ఎలాంటి భరణం చెల్లించాల్సిన పనిలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
కొందరు వ్యక్తులు ఒక్కోసారి భలే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. చిన్న విషయాలను పట్టించుకుని పెద్దదిగా చేసుకుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.