Home » Kolkata
కోల్కతా: త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్క్ కు తీసుకువచ్చిన ఆడసింహం పేరుపై వివాదం నెలకొంది. ఆడసింహాన్ని 'సీత'గా పిలుచుకుంటున్నారని, వెంటనే పేరు మార్చాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
గుజరాత్కు చెందిన గీత అనే వివాహిత కోల్ కతాలో 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ కోమాలో ఉన్న గీతకు ఇటీవల సృహ వచ్చింది. తన కుటుంబం వివరాలు చెప్పడంతో అధికారులు వీడియో కాల్ మాట్లాడించారు. గీతతో మాట్లాడటంతో ఆ కుటుంబ సభ్యులు తెగ సంబర పడిపోయారు.
తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్కతాలోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సోమవారం మధ్యాహ్నం డిశ్చార్చ్ అయ్యారు. మెదడుకు సంబంధించిన ''ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్''తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిథున్...తన అస్వస్థతకు దెయ్యంలా తినడమే కారణమని అన్నారు.
ఒక్క బిజినెస్ ఐడియా ఆ వ్యాపారికి తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. ఐడియాకు మద్దతుగా చర్యలు చేపట్టడం బిజినెస్ మ్యాన్కు సంతోషం కలిగించింది.
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు, అందరినీ బెదిరించి.. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు బిల్డింగులు, సెల్ టవర్లు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో ...
అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న జనవరి 22వ తేదీనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో 'మతసామరస్య ర్యాలీ' నిర్వహించనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో శనివారంనాడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండిగ్ సమయంలో ఆమె ఎడమ మోకాలికి, కుడి భుజానికి గాయాలయ్యాయి. రొటీన్ చెకప్లో భాగంగానే తాను ఆసుపత్రికి వచ్చానని, వైద్యులు పూర్తిగా పరీక్షలు జరిపారని మమతా బెనర్జీ తెలిపారు.
దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
'ఇండియా' కూటమి సమావేశానికి దూరంగా ఉండబోతున్నారంటూ వదంతుల రావడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు క్లారిటీ ఇచ్చారు. అందరికీ అనుకూలమైన తేదీన కాంగ్రెస్ నిర్ణయిస్తే త్వరలోనే తామంతా కలుస్తామని చెప్పారు.