Home » Kodandaram
ప్రజల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీ అయినా బతకదని, అందుకే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘మేం సరిగ్గానే ఉన్నాం.. ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ శాసన మండలి సభ్యులుగా ఈరోజు(సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని టీజేఏసీ అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఈ తీర్పు ఎవరికీ చెంపపెట్టు కాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు..
తెలంగాణ ఆవిర్భావంలో ప్రొ. కోదండ రామ్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరడమైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని ఎంపీ, బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్స్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరుగలేదని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్లకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. శాసనమండలి సభ్యులుగా వారి నియామకాన్ని రద్దు చేసింది. వారిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అని పేర్కొంది.
సుప్రీంకోర్టు పూర్తి వాదనలను వినడానికి సెప్టెంబర్ 17 తేదీని నిర్ణయించిందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆ రోజు తమకున్న సానుకూల అంశాలు సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17 జరిగే ఫైనల్ హియరింగ్లో తమ వైపే న్యాయం ఉందని ప్రూవ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ గవర్నమెంట్ విమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఉమాదేవి అధ్యక్షతన సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
బనకచర్ల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్లకు నీటి కేటాయింపులు చేయాలని తెలిపారు. గోదావరిలో తెలంగాణ వాటాను కేంద్ర ప్రభుత్వం తేల్చాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు.