Home » Kodali Nani
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోడంతో ప్రజలు వైసీపీ (YCP) నాయకులపై ఎదురుతిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించు కోకపోవడంతో.. ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు
మహిళా వలంటీర్తో మాజీ మంత్రి కొడాలి నాని కాళ్లు కడిగించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో మహిళలతో కాళ్లపై కొడలి నాని పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ సదరు మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడిగింది.
Kodali Nani: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్!. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదిగో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని (Kodali Nani) అయితే ‘నా రూటే సపరేటు’ అన్నట్లుగా నడుస్తున్నారు!. చుట్టూ వంద మంది భజన బృందం.. ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి..
టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన నిర్ణయం తీసుకున్నారు.! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు.. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో వీరాభిమానులు, అనుచరులు.. నియోజకవర్గ కార్యకర్తలు షాకవుతున్నారు. ఇక అధికార వైసీపీ (YSR Congress) పెద్దలు అయితే సడన్గా ఏమిటిది.. అంటూ కంగుతిన్నారు. నాని మనసులోని మాటనే చెప్పారా..? లేకుంటే భయపడి ఇలా చెప్పారా..? ఇవన్నీ కాదు.. సింపతీ కోసమేనా..? అని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది..
Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్నారని.. ఇప్పుడు రూ.370 కోట్ల రుణం ఎలా తెచ్చారని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొడాలి నానికి సడెన్గా జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి అది ప్రేమ కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసైనికులను రెచ్చగొట్టే కార్యక్రమం. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని ఇవాళ ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు.
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
Andhrapradesh: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.