Home » Khammam
రెండేళ్ల కిందట మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. పూజ్యులు ఎన్టీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని మంత్రి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 600 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
నిజామాబాద్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సు, లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అంతేకాకుండా..
భూ వివాదాల పరిష్కారంలో తెలంగాణకు కొత్త దిశ సాకారమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో కాలేశ్వరరావు అనే హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మాజీ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలతో హరీశ్ మానసిక స్థితి సరిగా లేదన్నారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకు ట్రై సైకిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీకి దక్కుతుందని మంత్రి సీతక్క ప్రశంసించారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు ఆమె స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.