• Home » Kejriwal

Kejriwal

AAP Vs YCP : కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చిన సీఎం జగన్

AAP Vs YCP : కేజ్రీవాల్‌కు ఝలక్ ఇచ్చిన సీఎం జగన్

దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారు.

Opposition meeting: బెంగళూరు సమావేశానికి 'ఆప్' గ్రీన్‌సిగ్నల్...

Opposition meeting: బెంగళూరు సమావేశానికి 'ఆప్' గ్రీన్‌సిగ్నల్...

విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు లో జరుగనున్న విపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరవుతుందా లేదా అనే అనిశ్చితికి తెరపడింది. విపక్షాల సమావేశానికి తాము హాజరవుతున్నట్టు 'ఆప్' ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది.

Delhi ordinance : ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌ మద్దతు

Delhi ordinance : ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌కు కాంగ్రెస్‌ మద్దతు

దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతివ్వబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.

Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..

Yamuna Floods : ఢిల్లీలో మళ్లీ కురుస్తున్న వర్షాలు.. యమునా నదిలో ప్రమాద స్థాయి దాటిన నీటి మట్టం..

ఢిల్లీ ప్రజల వరద కష్టాలు ఇంకా తీరడం లేదు. తాజాగా మళ్లీ మొదలైన వర్షాల వల్ల యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఆదివారం రాత్రికి ఈ నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.

Kejriwal: ఇది బీజేపీ 'వరద ప్రతీకార' కుట్ర.. వీడియో సాక్ష్యం చూపించిన 'ఆప్'

Kejriwal: ఇది బీజేపీ 'వరద ప్రతీకార' కుట్ర.. వీడియో సాక్ష్యం చూపించిన 'ఆప్'

యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.

Opposition Unity: విపక్షాల ఐక్యతా సమావేశానికి హాజరుకానున్న కేజ్రీవాల్..?

Opposition Unity: విపక్షాల ఐక్యతా సమావేశానికి హాజరుకానున్న కేజ్రీవాల్..?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి విపక్షాల ఐక్యతా యత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ వచ్చేవారం ఏర్పాటు చేయనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో 'ఆప్' అధినేత కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

Delhi excise case : మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తు.. సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది.

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి