Home » Kejriwal
దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు బదులుగా తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించారు.
విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు లో జరుగనున్న విపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరవుతుందా లేదా అనే అనిశ్చితికి తెరపడింది. విపక్షాల సమావేశానికి తాము హాజరవుతున్నట్టు 'ఆప్' ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మద్దతివ్వబోమని కాంగ్రెస్ ప్రకటించింది. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
ఢిల్లీ ప్రజల వరద కష్టాలు ఇంకా తీరడం లేదు. తాజాగా మళ్లీ మొదలైన వర్షాల వల్ల యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఆదివారం రాత్రికి ఈ నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి విపక్షాల ఐక్యతా యత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ వచ్చేవారం ఏర్పాటు చేయనున్న విపక్షాల ఐక్యతా సమావేశంలో 'ఆప్' అధినేత కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 7 గంటలకు వరద ఉద్ధృతి వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసానికి 500 మీటర్ల దూరంలో వరద నీరు ప్రవహిస్తోంది.
ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.