Delhi: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-07-02T13:43:31+05:30 IST

న్యూఢిల్లీ: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు ముడుపులు అందాయని, 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో...

Delhi: సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరోసారి కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. హైదరాబాదు (Hyderabad)లోని ఫార్మా కాంట్రాక్టర్ (Pharma Contractor) నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ (Delhi CM Kejriwal)కు ముడుపులు అందాయని, 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌ (Dubai)లో మూడు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వారం రోజుల క్రితం మూడు అపార్ట్‌మెంట్లను కేజ్రీవాల్ అత్యవసరంగా అమ్మకానికి పెట్టారన్నారు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖ (Letter) విడుదల చేశారు. తన తరపు న్యాయవాది అనంత మాలిక్ ద్వారా ఈ లేఖ విడుదల చేశారు.

Updated Date - 2023-07-02T13:43:31+05:30 IST