Home » Kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శనివారం కోర్టు ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్ను న్యాయస్థానం ఆదేశించింది.
పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని, ఎన్నికల సమయంలో మాత్రమే కమలం పార్టీకి ఇలాంటి విషాలు గుర్తుకు వస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళలందరినీ తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ప్రకటించింది. అసెంబ్లీలో నేడు బడ్జెట్ను కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓట్ల కోసం తాయిలాన్ని ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది.