Home » KCR
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు కోరే అన్ని అంశాలు అక్కడ చర్చిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ చచ్చిన పాము అని, ఆ పామును బతికించేందుకు గోదావరి-బనకచర్ల వివాదాన్ని వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
నీళ్ల సెంటిమెంటే బీఆర్ఎస్ను బతికిస్తోందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకోసం పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భూతాలుగా చూపుతున్నారంటూ నేతలను విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.