Home » Karnataka
ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి.. అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఆయన తన కుర్చీని కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నవంబర్ 20వ తేదీతో సిద్ధరామయ్య ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే 2023లో కుదిరిన ఒప్పందం ప్రకారం తదుపరి రెండున్నరేళ్ల పాలన డీకేకు అప్పగించాలని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు.
విపరీతమైన వేగం ప్రాణాలు హరిస్తుందన్న విషయాన్ని పదే పదే ట్రాఫిక్ ప్రకటనల ద్వారా తెలియచేస్తున్నా కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాళ్ల ప్రాణాలే కాకుండా, వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. ఈ షాకింగ్ వీడియో చూస్తే..
పోలీసులే దొంగలుగా మారారు. బాధ్యతగా ఉండాల్సిన రెండు చుక్కల అధికారులు కూడా దారితప్పారు. తమ స్వార్ధబుద్దితో ఓ వ్యాపారిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చివరకు కటకటాలపాలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ ప్రేమ జంట దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై నిలబడి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆదివారం చోటుచేసుకుంది.
నాలుగైదు నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందని, అయితే ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసేంత వరకూ ఆగాల్సిందిగా తాను సూచించానని సిద్ధరామయ్య చెప్పారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. సన్న పామప్ప అలియాస్ పామన్న నేరం చేసినట్లు రుజువు కావడంతో రాయచూరు జిల్లా మూడో అదనపు ఫాస్ట్ట్రాక్ న్యాయాధికారి బీబీ జకాతి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.