Home » Karnataka
తిరుపతిలో ఇటీవల చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్గా చేసుకుని చైన్ స్నాచింగ్ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.
రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో యువ న్యాయవాదులకు గోపాలగౌడ దిశానిర్దేశం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రైతులు, పర్యావరణం అనే అంశాలు తనను గోపాలగౌడకు దగ్గర చేసిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
కర్ణాటక గుహలో పోలీసులకు చిక్కిన రష్యన్ మహిళ, ఆమె పిల్లలను స్వదేశానికి తరలించొద్దంటూ పిటిషన్ వేసిన ఇజ్రాయెల్ వ్యక్తిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు గుహలో మగ్గుతుంటే మీరు గోవాలో ఏం చేస్తున్నారని మండిపడింది.
ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.
భాస్కర్ అనే వ్యక్తి స్కూటీ నడుపుతున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డుపై వేగంగా వెళుతున్న స్కూటీపై చెట్టు విరిగిపడింది. వెనకాల కూర్చున్న కీర్తనపై చెట్టు పడ్డంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు.
పెళ్లైన నాటినుంచి సయ్యద్ భార్యను ప్రతీరోజూ వేధిస్తూ ఉండేవాడు. తనకు 19 మంది మహిళలతో సంబంధం ఉందంటూ భార్య ముందు గర్వంగా చెప్పుకునేవాడు.
చోరీ చేసిన పశువుల్ని తన నివాసంలో వధిస్తూ వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తోన్న ఒక అక్రమ యూనిట్ పై పోలీసులు దాడులు చేశారు. దక్షిణ కర్ణాటకలోని బంట్వాల్ గ్రామంలో హసనబ్బా అనే వ్యక్తి..
మార్కెట్లో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా తగ్గిపోవడం రైతులకు నిరాశను మిగిల్చింది. జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరాకు చెందిన రైతు ఒకరు వారం రోజుల క్రితం ఉల్లిపాయ పంటను రాయచూరు ఏపీఎంసీ మార్కెట్ కు తీసుకురాగా ధర పూర్తిగా పడిపోవడంతో వారం రోజులుగా పడియావులు పడుతున్నాడు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.