Home » Kalvakuntla Taraka Rama Rao
తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు.
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ గులాబీ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ భవన్లో కేటీఆర్ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..
మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు.
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..
కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.