Home » KADAPA
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు
వైసీపీ నేత అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు.
Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.
చెన్నై సెంట్రల్-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 9,16,23,30 తేదీల్లో నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడిన వ్యక్తుల వరుస మరణాల నేపథ్యంలో... మరో నిందితుడు తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో రెండో నిందితుడు (ఏ2)గా ఉన్న సునీల్ యాదవ్ బుధవారం కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ను కలిశారు.
Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.