Home » Jubilee Hills
నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఓటింగ్ జరుగుతుండటంతో ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల బేరసారాలన్నీ పక్క నియోజకవర్గాల్లోకి మారాయి. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను ప్రారంభించాయి. కీలకంగా ఉన్న వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే బేరసారాలకు దిగితే ప్రత్యర్థులకు తెలుస్తుందని, అడ్డాలను పక్క నియోజకవర్గాలకు మార్చారు.
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే చాలా మంది జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని అనుకుంటారు. కానీ ..
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు, ఫొటో ఉన్న ఓటరు గుర్తింపుకార్డు ప్రతులను నాయకులు పంపిణీ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, తమ జెండా పాతాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంకోవైపు..
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీ పని చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్ అంటుందని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్.. రాజకీయ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వారిలో అత్యధికులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. దాంతో ఇక్కడ ఉంటేనే సీఎం పదవి దక్కుతుందనే నమ్మకం కొంతమంది నేతల్లో బలంగా ఏర్పడింది.