Home » Jogi Ramesh
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు జారీ చేశారు.
ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానంటూ సిట్ అధికారుల విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు.
జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు పీకల వరకు మునిగిపోయారని, ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇటువంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీని కూడా ముట్టడిస్తా’ అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు ఇంటి దాడి కేసులో జోగి రమేశ్ సీఐడీ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు “తెలియదు” అనే సమాధానం ఇచ్చారు. మీడియా ఎదుట “మళ్లీ అధికారంలోకి వస్తాం” అంటూ ధీమా వ్యక్తం చేశారు