Home » Janasena
Andhrapradesh: గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కూటమి నేతలు, కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లింది. నామినేషన్ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.
సీఎం జగన్పై ఎలక్షన్ కమిషన్కి టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. కోడ్ ఉల్లంఘించి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో టీడీపీ, జనసేన నేతలు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఫిర్యాదుపై సీఈవో జగన్ వివరణ కోరారు. అయితే సీఎం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈసీ అంటోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే.. చేబ్రోలులోని నివాసం నుంచి పవన్ బయలుదేరారు. ఇంటి నుంచి గౌలలప్రోలు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని.. అక్కడ నుంచి ర్యాలీగా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, మండలపరిషత్, తహసీల్దారు కార్యాలయాలు, బస్టాండు మీదుగా పిఠాపురం పట్టణంలోని ప్రవేశించనున్నారు.
ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల వ్యూహాలు, ఫార్మాలాలను అనుసరిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకొని..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Elections 2024) ప్రచారం హోరెత్తిపోతోంది. ఒక పక్క నామినేషన్లు.. మరోపక్క ప్రచారం మార్మోగుతోంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ప్రచార్వంలో దూసుకెళ్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సోమవారం ఊహించని అంతరాయం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలీకాప్టర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది.
ప.గో. జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా, బీమవరంలో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్? ప్రతి జీవితంలో ఒడిదొడుకులుంటాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ శివ శివానీ స్కూల్లో పేపర్ లీక్ చేసే సమయంలో తాను చెగువేరా గురించి చదివానని గుర్తుచేశారు. జగన్ నేను తలచుకుంటే తట్టుకోలేవు అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...