Home » JANASENA
ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశగా ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఉపముఖ్యమంత్రి స్పందించారు.
పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.
'అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాజధాని' అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్కు నేతలు స్వాగతం పలికారు.
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్ జనసేన సమన్వయకర్త షేక్రియాజ్ తెలిపాడు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డుని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరినట్టు అవుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే ప్రస్తావనను తీసుకొచ్చారు ఎమ్మెల్యే.