Home » Jammu and Kashmir
లడఖ్(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
డెమెక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ అనంత్ నాగ్ - రాజౌరీ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
మార్చి30: జమ్ము కశ్మీర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో 27 మంది స్టార్ కాంపేయనర్లు పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
జమ్మూ నుంచి శ్రీనగర్(Jammu Srinagar) వెళ్తున్న ప్యాసింజర్ SUV క్యాబ్(SUV skidded) రాంబన్ ప్రాంతంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఆ క్రమంలో టాక్సీ 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో అందులో 10 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 44పై రాంబన్లోని చష్మా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటలకు ప్రమాదం జరిగింది.
ఆదివారం జమ్మూకశ్మీర్ తొలిసారిగా ఫార్ములా - 4 ఈవెంట్కు శ్రీనగర్ వేదిక అయ్యింది.
లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శనివారంనాడు ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ .. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత గురువారం తొలిసారి ప్రధాని మోదీ(PM Modi) జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒకరితో సెల్ఫీ దిగుతూ.. ఆయన తన ఫ్రెండ్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
జమ్ముకశ్మీర్: శ్రీనగర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ర్యాలీ కోసం జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ప్రభుత్వం బలవంతంగా జనాలను సమీకరించిందని మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపణలు గుప్పించారు. సబ్-జీరో ఉష్ణోగ్రతలో బుద్గాం బస్ స్టాండ్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని వాహనాల్లోకి తరలించబడ్డారని ముఫ్తీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 నిబంధనను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురువారం తొలిసారిగా కశ్మీర్ లోయలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్లో ప్రధాని మోదీ రూ.6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన క్రమంలో దేశంలో పెళ్లిళ్ల గురించి ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేశారు.