Home » Israel
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడం, లేదా రాజీకి రావడంపై ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పది రోజల డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇరాన్ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ట్రంప్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటోంది.
శాంతి చర్చల ప్రతిపాదన ముందుకు కదలకపోవడంతో పశ్చిమాసియా భీకర దాడులతో దద్దరిల్లుతోంది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్కు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.
ఇరాన్, హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఈ తెల్లవారుజామున విరుచుకుపడింది. 340కి పైగా లక్ష్యాలు ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందిన ఆయుధాగారాలు, లెబనాన్లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలపైనా దాడులు తీవ్రతరం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.
ఇరాన్ 'B1' బ్రిడ్జ్ దాడిపై స్పందించిన ట్రంప్.. దారికి రాకపోతే, మరిన్ని దాడులుంటాయని హెచ్చరించారు. ఈ దాడి శత్రువు నైతిక పతనాన్ని సూచిస్తుందని.. ఇలాంటి చర్యలు ఇరానియన్ల ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఇరాన్ తేల్చి చెప్పింది.
యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ట్రంప్ స్పీచ్ ఈ ఉదయం రానేవచ్చింది. ఇరాన్ ఆపరేషన్పై ట్రంప్ మళ్లీ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన లక్ష్యాలను చేరుకున్నాం.. దాడులు కొనసాగుతాయనీ చెప్పుకొచ్చారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అత్యంత సన్నిహిత సలహాదారు కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఖరాజీ నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖరాజీ భార్య ప్రాణాలు కోల్పోయారు. ఖరాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం 'ఇస్లామిక్ రిపబ్లిక్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.
హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాపై ఇరాన్ పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం మార్గాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు. అదే 'మెడిటరేనియన్ పైప్లైన్' రీ-రూటింగ్ ప్లాన్.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.