Home » International News
ఢిల్లీ పేలుళ్లలో పలువురు మృతులకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల వాంగ్చుక్ సంతాపం తెలిపారు. చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కు సంతాపం తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
రష్యాలో భారతీయులకు వేల ఉద్యోగాలు లభించబోతున్నాయా? దాదాపు 70 వేల మంది భారతీయ కార్మికులు, నిపుణులకు రష్యా ఉద్యోగావకాశాలు కల్పించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతున్నారు.
ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కెనడియన్-హంగేరియన్-బ్రిటీష్ రచయిత డేవిడ్ సలైను వరించింది. ఓ సాధారణ వ్యక్తి నేపథ్యంలో డేవిడ్ సలై రాసిన భావోద్వేగభరిత 'ఫ్లెష్' నవలకు ఈ అవార్డు దక్కింది.
పలు ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తుండడాన్ని అక్కడి న్యాయస్థానాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తీరుపై అమెరికా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
జపాన్లో భూ ప్రకంపనలు మరోసారి అల్లకల్లోలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో అక్కడ మూడుసార్లు సునామీ కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేశారు అక్కడి అధికారులు.
జపాన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సనాయె తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ దేశంలో తనతో సహా క్యాబినెట్ సభ్యులకు అదనపు జీతాలు చెల్లించకూడదని నిర్ణయం తీస్కున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలి ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు ఏఈపీకి తెలిపాయి.