Home » INDIA Alliance
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీయే(NDA), ఇండియా కూటమి పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.
ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది.
20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అహ్మద్ పటేల్ (Ahmed Patel) కంచుకోట అయిన భరూచ్ (Bharuch) సీటుని ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi Party) కట్టబెట్టడంపై కాంగ్రెస్ పార్టీపై (Congress) బీజేపీ (BJP) విమర్శలు గుప్పించింది. ఇది రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రతీకార చర్యేనని బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ (Jaiveer Shergill) ఆరోపించారు. అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఉండగా.. అందుకు ప్రతీకారంగానే ఆయన కంచుకోటను ఆప్కు అప్పగించారని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ , కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. సమాజ్వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది.
ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు.
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఇండియా కూటమిలో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కూటమి ఏర్పాటు చేసినప్పుడు చాలా పార్టీలతో కలకలలాడిన ఇండియా కూటమి ప్రస్తుతం కీలక పార్టీల నిష్క్రమణతో వెలవెలబోయింది.