Home » IMD
ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తుండటంతో తూత్తుకుడి, నాగపట్టినం, కారైక్కాల్ ప్రాంతాల మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళకుండా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
వాతావరణంలో నెలకొన్న పరిస్థితులతో ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఈ నెల 8వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దంచికొడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.