Home » Illegal Constructions
హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.
అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం చీమలపల్లిలో ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన పాకలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చీమలపల్లిలోని సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన సుమారు 400 పాకలను అధికారులు తొలగించారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
మాజీమంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గుల్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను(వెంచర్) బుధవారం కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.
కొండాపూర్లో హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.