Home » HYDRA
రంగారెడ్డి జిల్లా హల్మాస్గూడ బోయిన్పల్లి కాలనీలో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శేఖర్ కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నించారు.
హైడ్రా పేరుతో ఎవరు సెటిల్మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు.
హైడ్రా పేరుతో ఇక సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.
హైడ్రా కమిషనర్ ఆవుల వెంకటరంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కేసులకు సంభందించి విచారణను నాంపల్లి 9వ చీఫ్ డిస్ర్టిక్ట్ మెజిస్ర్టేట్ కోర్డులో జరపనున్నారు.
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
అనుమతులు లేని హోర్డింగ్లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
రోడ్లు, పార్లుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా చెరువులపైనా దృష్టి సారించింది. గురువారం కుత్బుల్లాపుర్ మండలం జగద్గిరిగుట్టలోని పరికి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించింది.
‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.