Home » HYDRA
కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు.
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా హైడ్రా అధికారులు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలు కూల్చివేశారు.
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా(HYDRA) నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
HYDRA: ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. అమీర్పూర్లో అక్రమాలపై మరోసారి పంజా విసిరింది హైడ్రా. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
ఆ లేఔట్లో ప్లాట్ కొనాలన్నా.. అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీ లు జరగవు. అమ్మేవారు రూ.50వేలు చెల్లించి, మల్లారెడ్డి ఇచ్చే ఎన్వోసీ తీసుకోవాల్సిందే. డెవల్పమెంట్ను ఆయనకే అప్పగించాలి. ఇల్లు నిర్మించే కాంట్రా క్ట్ కూడా ఆయనకే ఇవ్వాలి’’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో రహదారికి అడ్డుగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు..
Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.
బుద్ధభవన్లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీజీ-ఆగ్రోస్) కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి..!
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు.