Home » Hyderabad City Police
ప్రముఖ సినీ నటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను నమ్మించి సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి.
హైదరాబాద్లో మాదకద్రవ్యాల కట్టడిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన మెరుపు దాడిలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయింది. మౌలాలి పారిశ్రామిక వాడ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను అధికారులు ఛేదించి, కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రముఖ గాయని మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు డీజీపీని సోమవారం అడ్వకేట్ కలిశారు.
ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ,స్పెషల్ టీం, ఎచ్ న్యూ మొత్తం 5000 మంది సిబ్బంది ఈ రైడ్స్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జేకే కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
తొమ్మిదేళ్ల బాలికను కాపాడిన ముగ్గురు సామాన్య పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ ప్రశంసించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న సెజల్, గణపతి, కాశీనాథ్లను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటన భాగ్యనగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ప్రముఖ గాయని మంగ్లీ కేసులో బాధితుల తరఫున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్కు ఈరోజు ఉదయం వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు డ్రంకెన్ టెస్ట్ చేశారు.