Home » GHMC
మాంగార్ బస్తీ, ముషీరాబాద్ వినోభానగర్లోని నాలాల్లో పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మూడు రోజులుగా హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఫలితం లభించలేదు.
వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్పుర, సోమాజిగూడ, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
యాకుత్పురా మౌలా కా చిల్లాలో జరిగిన క్యాచ్పిట్ ప్రమాద ఘటనను హైడ్రా తీవ్రంగా పరిగణించింది. వరద నీటి కాలువలో వ్యర్థాలు తొలగించి తిరిగి మూత ఏర్పాటు చేయలేదని గుర్తించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
ఓ చిన్నారి వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయింది. తల్లి అప్రమత్తతతో క్షేమంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలా కా చిల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ సల్మాన్ కుమార్తె జైనబ్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో యూకేజీ చదువుతోంది.
అధికారులు, ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ర్టానిక్ వస్తువుల సమగ్ర జాబితా డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్వెంటరీ యాప్ రూపకల్పనకు ఐటీ విభాగం కసరత్తు ప్రారంభించింది.
హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్లో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చార్మినార్ జోనల్ కమిషనర్ స్పందించారు.
కూకట్పల్లి జలమండలి పరిధిలో ఈ నెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా ఉండదని జీఎం హరిశంకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోదావరి ఫేజ్-1 డయా వాల్వుల మార్పు పనుల్లో భాగంగా 48 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఖైరతాబాద్, కూకట్పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు.