Home » GHMC
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కే. తారకరామారావు శనివారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. కెమెరాతో పైప్లైన్ లీకేజీ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. నీరు కలుషితం కాకుండా చూడటం, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూసే క్రమంలో భాగంగా ఈ పద్దతిని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడంపై కమిషనర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని హెచ్చరించింది
ఏం డౌట్ లేదు.. ఆ కట్టడాలు ఎక్కడున్నా కూల్చేసుడే.. అని అంటున్నారు అధికారులు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ‘కనిపిస్తే జాగా.. వేసేయ్ పాగా..’ అన్నట్లుగా ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ నేతలు వినూత్న తరహాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డివిజన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఉప్పలమ్మా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయమ్మా.. అంటూ అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు.
గత కొంతకాలంగా నల్లాలకు మోటర్లు బిగించిన యధేచ్చగా నీటిని వాడుకోవడంపై గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా మోటర్లను సీజ్ చేస్తున్నారు. దీంతో నల్లాలకు అక్రమంగా మోటర్లు బిగించిన వారి గుండెల్లో గుబులు మొదలైంది.
హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాలకు శనివారం గోదావరి జలాలు పంపిణీ కావని సంబంధిత అధికారులు తెలిపారు. పైప్లైన్ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల రేపు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Good News for Hyderabadis: హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అతి త్వరలో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది.
నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.