Home » Ganta Srinivasa Rao
TDP MLA Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. ఇందుకోసం అభ్యర్థులను మార్చడంలో కూడా టీడీపీ అధినేత వెనకాడట్లేదు. సర్వేలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మళ్లీ కసరత్తులు చేసి.. మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?
సీఎం జగన్ రెడ్డి(CM Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) X(ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు జగన్, ఆయన అనుచరులు వచ్చాక ఆగడాలు మీతిమీరిపోయాయని అన్నారు. విశాఖలో ప్రజలకు రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆయనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.
ఏపీ సచివాలయం తాకట్టుపై X(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని... ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
రెండు రోజులక్రితం విశాఖపట్నంలో హడావుడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా విరిగిపోవడంతో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తూ బ్రిడ్జి ముక్కలవుతున్న సమయంలో దానిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాస రావు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ‘విశాఖ సిగలో మరో మణిహారం’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
AP Elections 2024: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది..
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమన్నారని.. అయితే భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని తాను చంద్రబాబుకు వివరించానని తెలిపారు. తానెక్కడ పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు.
TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..