Home » Fire Accident
శామీర్పేట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.
పఠాన్చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
గ్రౌండ్ హ్యాండిలర్స్కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
గోడౌన్లో సీజ్ చేసిన లిక్కర్తో పాటు, రైల్వే షిప్పింగ్ మెటీరియల్ కూడా ఉందని డీఎఫ్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించని సీజ్ చేసిన మెటీరియల్ను కస్టమ్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచారని చెప్పారు.
బైక్పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి డోన్కు వెళ్తుండగా.. ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు ఎక్కడికక్కడ పూర్తిగా కాలిపోయింది. భగ్గున చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళ హైమారెడ్డి.. ఆ దృశ్యాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.