Home » Farmers
రాష్ట్రంలో యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రైతులు బారులు తీరి పడిగాపులు పడుతున్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒక దశలో తోపులాట జరిగింది.
రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో గానీ తెల్లవారగానే క్యూలైన్లలో నిల్చోవడం వారికి తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షించినా సరిపడా బస్తాలు దొరక్కపోవడంతో నిరాశా తప్పడం లేదు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు సాగు చేయగా.. అవి ఇంకా నిలదొక్కుకోకముందే వానలు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండ్రోజుల్లో రాష్ట్రానికి 21,325 టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఏపీ రైతులకు శుభవార్త. రాష్ట్రానికి తక్షణ అవసరాల నిమిత్తం 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీ రైతులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పండుగ లాంటి వార్త తెలిపారు. ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని పేర్కొన్నారు.
ఎరువుల లభ్యత, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు.
రాష్ట్రంలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అరకొరగా వస్తున్న యూరియాను అధికారులు టోకెన్లు జారీ చేసి.. పోలీసుల బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా గురించి నిరంతరం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పంటల అవసరాలకు దోసిళ్లకొద్దీ డిమాండ్ ఉంటే అందుబాటులో ఉన్న యూరియా పిడికెడంత మాత్రమే! ఫలితంగా చాంతాడంత క్యూలో గంటలకొద్దీ నిల్చున్నా సరుకు దొరుకుతుందన్న నమ్మకం ఉండటం లేదు