Home » Etela rajender
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.
గజ్వేల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.
Telangana Elections: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఆ భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు.
Telangana Elections: జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈటెల వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
బీజేపీకి తెలంగాణలో ఏదో గ్రహణం పట్టినట్టుంది. పార్టీ నుంచి పోయే వారే తప్ప వచ్చేవారు లేరు. పార్టీ నుంచి ఇప్పటికే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. నేడు అశ్వద్దామరెడ్డి రాజీనామా చేశారు.
Telangana Elections: గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Telangana Elections: బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రచార ర్యాలీ, కార్నర్ మీటింగ్లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బాధలు, కన్నీళ్ల తెలంగాణాను అందించారని బీజేపీ ఎన్నికల నిర్వహణ
వర్గల్ మండలంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే దేవాలయ భూములను కూడా అమ్మేస్తాడన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.