Home » Employees
వ్యవసాయశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. బదిలీల్లో తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో 32,271 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో 35,371 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్ ఈ మేరకు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.
2017 తర్వాత రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఖాళీల సమస్య పెరిగిపోతున్నట్లు సమాచారమొచ్చింది. యువత ఇటీవలి ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యపై సీరియస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తోంది. 1,27,326 మందిలో 19 వేల మందిని ఇప్పటివరకు తొలగించారు.
రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో పూర్తి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధమయ్యాయి. మే 1న సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా, మరో 40 పార్కులకు శంకుస్థాపన జరగనుంది.
ప్రపంచానికి క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులు కాదు, ఉద్యోగాలు కల్పించగల ఎంటర్ప్రెన్యూర్లు కావాలని యువతను ఉత్సాహపరిచారు. అమరావతిలో దేశంలోని 7 ఉత్తమ వర్సిటీలు ఏర్పాటవుతాయని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కార్పొరేషన్లో 248 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. వీరిలో అధికంగా వైసీపీ కార్యకర్తలు ఉండగా, దీని వల్ల వైజాగ్ నాక్ మూతపడే పరిస్థితి ఏర్పడింది
టెక్ కంపెనీల్లో లేఆ్ఫల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించింది. తన ప్లాట్ఫాంలు, డివైజెస్ విభాగాల్లో పనిచేసే వందలాది మందికి ఉద్వాసన పలికింది.